Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవ్యాక్సిన్‌కు ''NO'' చెప్పిన బ్రెజిల్.. వివరణ ఇచ్చిన భారత్ బయోటెక్?!

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (20:39 IST)
కరోనా వ్యాక్సిన్‌ను వివిధ బయో కంపెనీలు తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫైజర్, కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వంటివి వున్నాయి. ఈ వ్యాక్సిన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దిశగా ఆయా ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్ టీకాను దిగుమతి చేసుకోమంటూ బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 
 
టీకా ఉత్పత్తికి సంబంధించిన పారిశ్రామిక నిబంధనలు భారత్ బయోటెక్ పాటించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న బ్రెజిల్ గతంలో రెండు మిలియన్ల కొవ్యాక్సిన్ టీకా డోసులను దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ పరిణామంపై భారత్ బయోటెక్ కూడా స్పందించింది.
 
బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు అమలు చేస్తామని, ఎప్పట్లోగా ఈ పనిచేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. కొవ్యాక్సిన్ కరోనా టీకాను భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తైన క్లినికల్ ట్రయల్స్‌లో టీకా ప్రభావశీలత 81 శాతంగా ఉన్నట్టు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments