Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

ఠాగూర్
ఆదివారం, 25 మే 2025 (16:30 IST)
దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. బెంగుళూరు నగరంలో చాలాకాలం తర్వాత ఈ మృతి కేసు నమోదు కావడం గమనార్హం. శనివారం 85 యేళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 108 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఐదుగురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం కర్నాటకలో మొత్తం 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  వీరిలో 32 మంది బెంగుళూరు నగరంలోనే చికిత్స పొందుతున్నారు.
 
దీనిపై కర్నాటక ఆరోగ్య శాఖామంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది చాలా సాధారణ పరిస్థితి. గత 15 రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది అని ఆయన శనివారం బెంగుళూరులో మీడియాకు తెలిపారు. 
 
"కరోనా వైరస్ ఇపుడు మన వ్యవస్థలో ఒక భాగంగా మారిందని, ఇతర వైరస్‌ల మాదిరిగానే దీన్ని పరిగణించాలని" మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. తీవ్రమైన లక్షణాలు కనిపించనంత వరకు భయపడాల్సిన పనిలేదని, ప్రజలు సాధారణ జీవనం కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటివి కరోనాతో పాటు ఇతర వ్యాధులు నివారణకు కూడా ఉపయోగడతాయని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments