Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ఠాగూర్
ఆదివారం, 25 మే 2025 (16:11 IST)
ఢిల్లీని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశాయి. ఈ భారీ వర్షాలతో ఢిల్లీ నగరం అతలాకుతలమైంది. ఈ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఘజియాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ కూలిపోయింది. ఠాణా పైకప్పు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఆ స్టేషన్ ఎస్ఐ దుర్మరణం పాలయ్యాడు. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్‌లో వీరేంద్ర మిశ్రా (58) ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వర్షం, పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కూలిపోయింది. 
 
వర్షం కారణంగా స్టేషన్‌లోనే ఉండిపోయిన మిశ్రా.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీదపడటంతో తీవ్ర గాయాలపాలై మిశ్రా మరణించారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల మేరకు.. ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు 81.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మోతీబాగా, మింట్ రోడ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments