Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ఠాగూర్
ఆదివారం, 25 మే 2025 (16:11 IST)
ఢిల్లీని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశాయి. ఈ భారీ వర్షాలతో ఢిల్లీ నగరం అతలాకుతలమైంది. ఈ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఘజియాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ కూలిపోయింది. ఠాణా పైకప్పు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఆ స్టేషన్ ఎస్ఐ దుర్మరణం పాలయ్యాడు. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్‌లో వీరేంద్ర మిశ్రా (58) ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వర్షం, పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కూలిపోయింది. 
 
వర్షం కారణంగా స్టేషన్‌లోనే ఉండిపోయిన మిశ్రా.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీదపడటంతో తీవ్ర గాయాలపాలై మిశ్రా మరణించారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల మేరకు.. ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు 81.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మోతీబాగా, మింట్ రోడ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments