Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. 10వేల మార్కు దాటిన కేసులు

Webdunia
గురువారం, 30 జులై 2020 (19:13 IST)
ఏపీలో కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. గడిచిన 24గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,167 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది. ఏపీని కరోనా మహమ్మారి పట్టిపిడిస్తోంది. రెండు రోజులుగా పదివేల కేసులు నమోదవుతున్నాయి. 
 
ప్రస్తుతం ఏపీలో 69,252 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాను జయించి 60,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 18,90,077 కరోనా టెస్టుల నిర్వహించారు. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా రాష్ట్రంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. అటు కేసులు, ఇటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఒక్క రోజే కరోనాతో 68 మంది మృతి చెందారు. 
 
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,281 మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో తొమ్మిది మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో 8 మంది చొప్పున మృతి చెందారు. 
 
ఎప్పటిల్లాగే తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా 1,441 కేసులు నమోదయ్యాయి. కర్నూలు 1,252, విశాఖ 1,223, పశ్చిమగోదావరి జిల్లాలో 998 కేసులు నమోదయ్యాయి. అనంతపురం 954, గుంటూరు 946, కడప 753, నెల్లూరు 702, శ్రీకాకుళం 586 కేసులను గుర్తించారు. చిత్తూరు 509, ప్రకాశం 318, కృష్ణా 271, విజయనగరం 214 మందికి కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments