Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (13:10 IST)
దేశంలోనే కరోనా రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అవతరించింది. కొవిడ్‌-19 బారినపడిన వారిలో చిట్ట‌చివ‌రి ముగ్గురు కోలుకోవ‌డంతో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఆదివారం క‌రోనా వైర‌స్‌లేని రాష్ట్రంగా మారింద‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. 
 
ఈశాన్య రాష్ట్రం అరుణాచ‌ల్‌లో మొత్తం 16,836 కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వీరిలో 56 మంది చ‌నిపోగా మిగిలిన 16,780 మంది వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజా కొవిడ్ కేసులేవి న‌మోదు కాలేద‌న్నారు. 
 
ఇదిలావుండగా రాష్ట్రంలో ఇప్పటివరకు 32,325 మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డిమోంగ్ పాడుంగ్ తెలిపారు. ఆరోగ్య శాఖ వారానికి నాలుగు రోజులు - సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం టీకాల డ్రైవ్ నిర్వహిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments