Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా.. ఆర్బీఐ చెప్పేదేమిటంటే?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:20 IST)
కరోనాతో పాటు ఇతరత్రా వైరస్‌లు కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించే అవకాశం వుందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. గత మార్చి 9వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాసిన లేఖలో.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తించే అవకాశం వుందని తెలిపింది. 
 
కరోనా మాత్రమే కాకుండా బ్యాక్టీరియాలు, వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌తో పాటు బ్యాక్టీరియాలు కూడా వ్యాపించే అవకాశం వుందని తెలిపింది. 
 
అందుచేత కరోనాను నియంత్రించేందుకు కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుని డిజిటల్ లావాదేవీలను చేయాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఇంకా ప్రజలు అనవసరంగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసుకోవద్దని.. అనేక ఆన్‌లైన్ వసతుల ద్వారా నగదు లావాదేవీలను జరపాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments