Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనావైరస్ బీభత్సం, ఒక్కరోజే 3,963 కేసులు నమోదు

Webdunia
శనివారం, 18 జులై 2020 (19:45 IST)
ఏపీ కరోనావైరస్ కేసుల విషయంలో పొరుగు రాష్ట్రం తమిళనాడుతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇక్కడ కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 52 మంది మృత్యువాత పడగా కేసుల సంఖ్య ఒకేసారి 3,963గా నమోదయ్యాయి. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు.
 
కాగా కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.
 
రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోనే 994 మందికి పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ఇవాళ మొత్తం 3963 నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరాయి. వీరిలో ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments