ఏపీలో కరోనావైరస్ బీభత్సం, ఒక్కరోజే 3,963 కేసులు నమోదు

Webdunia
శనివారం, 18 జులై 2020 (19:45 IST)
ఏపీ కరోనావైరస్ కేసుల విషయంలో పొరుగు రాష్ట్రం తమిళనాడుతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇక్కడ కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 52 మంది మృత్యువాత పడగా కేసుల సంఖ్య ఒకేసారి 3,963గా నమోదయ్యాయి. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు.
 
కాగా కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.
 
రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోనే 994 మందికి పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ఇవాళ మొత్తం 3963 నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరాయి. వీరిలో ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments