Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణ ఘోష - కొత్త కేసులు 10,820

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (22:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణ ఘోష వినిపిస్తోంది. ఒకవైపు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులతో పాటు మరోవైపు మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 97 మంది మృత్యువాత పడ్డారు. 
 
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు చోటుచేసుకోగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,036కి పెరిగింది.
 
ఇక, కొత్తగా 10,820 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,860కి చేరింది. తాజాగా మరో 9,097 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 87,112 మంది చికిత్స పొందుతున్నారు. 
 
తెలంగాణాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి 
తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 1669 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. ఆసుపత్రుల్లో 22,869 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 55,999 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 627కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 463కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 139 కేసులు నమోదయ్యాయి.
 
దేశంలో 21 లక్షలు దాటిన కేసులు 
అదేవిధంగా దేశంలోనూ కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 64,399 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 861 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 21,53,011కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 43,379కి పెరిగింది. 6,28,747 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 14,80,885 మంది కోలుకున్నారు.
 
కాగా, శనివారం వరకు మొత్తం 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులో 7,19,364  శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments