తెలంగాణ, కర్ణాటక హై రిస్క్ రాష్ట్రాలు: ఏపీ సర్కారు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (22:29 IST)
తెలంగాణ, కర్ణాటకను సహా హైరిస్క్ రాష్ట్రాలుగా ఏపీలోని వైకాపా సర్కారు పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, కర్ణాటకల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఏపీకి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న నేపథ్యంలో హై రిస్క్ ప్రాంతాలుగా మార్పులు చేయడం జరిగిందని జవహర్ రెడ్డి తెలిపారు. ఫలితంగా విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు ఖచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనన్నారు.

విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలి. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేసి, 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని జవహర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

Anandhi: గరివిడి లక్ష్మి లో కోసింది కొయగూర సాంగ్ లో ఆకట్టుకున్న ఆనంది

Kona Venkat: బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇంకో సారి నా సినిమాని చూడకండి.: కోన వెంకట్

Atlee: అల్లు అర్జున్ AA22 సైన్ ఫిక్షన్ చిత్రం అప్ డేట్ తో అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments