Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18 నుంచి లాక్డౌన్ 4.O : రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు... న్యూ రూల్స్ ఇవే... (video)

18 నుంచి లాక్డౌన్ 4.O : రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు... న్యూ రూల్స్ ఇవే... (video)
, ఆదివారం, 17 మే 2020 (20:40 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ అమల్లో వుంది. ఇప్పటివరకు మూడు దశల్లో లాక్డౌన్ అమలు చేయగా, అది ఆదివారంతో ముగిసింది. దీంతో సోమవారం నాలుగో విడతగా లాక్డౌన్ అమలు కానుంది. ఇది మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు కొత్త ఆదివారం రాత్రి ప్రకటన చేసింది. అయితే, ఈ నాలుగో దశలో పలు సడలింపులు ఇచ్చింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి సమన్వయంతో వాహనాల రాకపోకలకు అనుమతించవచ్చు. 
* రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు నిర్వహించుకోవచ్చు.
* సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశాలపై యధావిధిగా నిషేధం కొనసాగుతుంది. 
* కరోనా వైరస్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేవలం నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి.
* సరుకు రవాణాకు మాత్రం అన్ని రాష్ట్రాలు విధిగా అనుమతించాల్సిందే. 
 
* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుంపులుగా చేరడంపై నిషేధం. 
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 
* క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు. 
* మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది. 
* అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే. 
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు. 
 
* ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతాపరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు. 
* అన్ని రాష్ట్రాల్లో మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.
* పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది.
* కానీ, ఆన్‌లైన్ విద్యాబోధన, దూర విద్యా బోధన మాత్రం కొనసాగుతుంది. 
 
* హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది. 
* కానీ, హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరిచివుంచొచ్చు. 
* బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి. 
* ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి.

* అయితే, ఈ దఫా జోన్ల ఏర్పాటు, ప్రకటనలపై పూర్తి నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కట్టబెట్టింది. 
* ఆయా రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల ఏర్పాటు చేసుకోవడమే కాదు, వాటిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. 
* ముఖ్యంగా, 65 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భవతులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటివద్దే ఉండాలని సూచించారు. 
 
* ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా డౌన్‌లోడ్ చేసుకునివుండాల్సిందేనని స్పష్టం చేసింది. 
*  సాధారణ వ్యక్తుల్లోనూ ఆరోగ్య సేతు యాప్ వినియోగం పట్ల చైతన్యం కలిగించాలని తెలిపారు.
* అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వైద్య, ఆరోగ్య నిపుణులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్‌ల కదలికలపై ఆంక్షలు విధించరాదని కేంద్రం స్పష్టం చేసింది. వారు ఇతర రాష్ట్రాల్లో సేవలు అందించాల్సిన అవసరం వస్తే అనుమతించాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మదనపల్లె సబ్‌కలెక్టరుగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని!