Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చిలు - మసీదులు కోవిడ్ కేర్ సెంటర్లకు పనికిరావా?

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. దీంతో ప్రభుత్వం కరోనా రోగులను ఆదుకునేందుకు అనేక ప్రాంతాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను నెలకొల్పుతోంది. ఇందులోభాగంగా, పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలకు చెందిన వసతి గృహాలను సైతం కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. కానీ, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క మసీదు లేదా చర్చిమాత్రం కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్ కేర్ సెంటర్‌లు‌గా హిందూ ఆలయాలుతో పాటు ఇతరులవి ఎందుకు వాడుకోరు అని ప్రశ్నించారు. 'ఈ కపట ప్రేమ ఎందుకు! దీనినే చౌకబారు రాజకీయం అంటారు! సీఎం జగన్‌ గారు, అన్ని మతాలలో కరోనా బాధితులు వున్నారు! వారి ప్రధానాలయాలను తీసుకోండి! కేవలం హిందూ ఆలయాలు మాత్రమే అంటే నిర్ద్వందంగా ఎండగట్టుతాము!' అని స్పష్టం చేశారు. 
 
కాగా, ఇప్పటికే హిందూ ఆలయాల వసతి గృహాలు కోవిడ్ కేర్‌ సెంటర్లుగా అద్భుతమైన సేవాలు అందిస్తున్నాయని...మరి ఒక్కటంటే ఒకటి ఇతరులవి ఏర్పాటు చెయ్యలేక పోతున్నారని మండిపడ్డారు. కారణం ప్రశ్నించేవారు లేరనా? లేక అన్నింటికి తలూపే దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారనా అంటూ రమేష్ నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments