Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అధికార పార్టీకి కరోనా వణుకు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (14:19 IST)
ఏపీలో కరోనా మహమ్మారి అందర్ని భయాందోళనకు గురిచేస్తున్నది. సాధారణ ప్రజల నుండి ప్రజా ప్రతినిధులు వరకు దీని బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5,27,512 కు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా 4,634 మంది మరణించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అధికార పార్టీ నేతలను వణికిస్తోంది.
 
ఇదిలావుండగా తాజాగా వైస్సార్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరు హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆళ్ల రామకృష్ణా రెడ్డి తండ్రి దశరథ రామకృష్ణా రెడ్డి మృతి చెందారు.
 
ఆయన అంత్యక్రియలకు పాల్గొనడంతో ఆర్‌కెకు కరోనా సోకింది. తన తండ్రి మృతి సమయంలో తనను వచ్చి కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ దాడి శెట్టి రాజా చికిత్స తీసుకోవడానికి విశాఖపట్నం వెళ్లినట్టుగా తెలిపారు. ప్రతిపక్ష పార్టీలతో పోల్చుకుంటే అధికార వైసీపీ లోనే పెద్దఎత్తున కేసులు నమోదవుతున్న తీరు అధికార పార్టీ నేతలకు పెద్ద టెన్షన్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments