Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనావైరస్ కలకలం, కొత్తగా 8,096 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా మహమ్మారి రోజురోజుకీ పెరిగిపోతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,096 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ఇందులో 84,423 యాక్టివ్ కేసులుండగా 5,19,891 మంది కరోనా నుండి కోలుకున్నారు.
 
తాజాగా మరో 67 మంది కరోనాతో పోరాడి మరణించారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 5,244కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 74,710 టెస్టులు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 49,59,081కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
 
ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1405 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 463, చిత్తూరులో 902, గుంటూరులో 513, కడపలో 419, కృష్ణా జిల్లాలో 487, కర్నూలు 337, నెల్లూరు 468, ప్రకాశంలో 713, శ్రీకాకుళం 496, విశాఖపట్నం 371, విజయనగరంలో 487, వెస్ట్ గోదావరిలో 1035 కేసులు నమోదయ్యాయి.
 
ఇక కడప జిల్లాలో 8, చిత్తూరు 7, కృష్ణా 7, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, నెల్లూరు 5, శ్రీకాకుళం 5, పశ్చిమగోదావరి 4, ప్రకాశం 4, విజయనగరం 3, కర్నూలులో ఇద్దరు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments