Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌కి కరోనాపాజిటివ్ వ్యక్తులు, ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:20 IST)
భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలపై దుబాయ్ ప్రభుత్వం 15 రోజులపాటు నిషేధం విధించింది. గత రెండు వారాల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో కరోనా పాజిటివ్ సర్టిఫికేట్ ఉన్న ప్రయాణికులను రెండుసార్లు తీసుకువచ్చినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటి అధికారులు ఎయిర్ ఇండియా సర్వీసులను అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు శుక్రవారం వెల్లడించారు.
 
యుఏఈ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులందరూ 96 గంటలు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో నెగటివ్‌గా నిర్థారణ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే దుబాయ్ రావడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ నెల 4న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ జైపూర్ దుబాయ్ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వద్ద సెప్టెంబరు 2వ తేదీతో కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్ ఉందని అధికారులు తెలిపారు.
 
ఇంతకుముందు వారం కూడా ఇలాంటి సంఘటన జరిగిందని ఈ మేరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు నిలిపివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments