Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు.. నలుగురు మృతి

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:52 IST)
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. తాజాగా ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,80,430కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. 
 
ఇప్పటివరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 7,091 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3,861 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,69,478 మంది రికవరీ అయ్యారు. కొత్తగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా మృతి చెందారు.
 
కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజలను స్ట్రెయిన్ వైరస్ కలవర పెడుతోంది. యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారి కోసం విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రిలో 300 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 150 కోవిడ్, మరో 150 బెడ్లను నాన్ కోవిడ్ పేషెంట్లకు కేటాయించారు. 
 
యూకే నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి.. పరిస్థితిని బట్టి వారిని సంబంధిత వార్డుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. కాగా, స్ట్రెయిన్ కలకలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అలెర్ట్ చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments