Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దుమ్మురేపుతున్న కరోనా పాజిటివ్ కేసులు - ఉండవల్లికి పాజిటివ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులుకారు. ప్రతి ఒక్కరిపై దాడి చేస్తోంది. 
 
ఫలితంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు దుమ్మురేపుతున్నాయి. బుధవారం ఏకంగా సుమారుగా 11 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా ప్రకటన మేరకు... బుధవారం కొత్తగా 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులున్నాయి. బుధవారం వరకు 2,86,720 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు. 
 
ఇదిలావుండగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు కరోనా సోకింది. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహాలను పాటిస్తూ రాజమండ్రిలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments