Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ చార్జీలను అధికమిస్తున్న ఆంబులెన్స్ చార్జీలు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (15:48 IST)
హైదరాబాదులో ఆంబులెన్స్ చార్జీలు ఫ్లైట్ చార్జీలను మించిపోతున్నాయి. కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న కొందరు ఆంబులెన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. కేవలం ఐదు కిలోమీటర్ల దూరానికి పదివేలకు పైగా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్లేలోపు జేబులు ఖాళీ అవుతున్నాయి.
 
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను బలి తీసుకుంటుంటే కొందరు మాత్రం దానిని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా భయాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు డబ్బులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇదే ఆసరాగా చేసుకున్న ఆంబులెన్స్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు.
 
అత్యవసర పరిస్థితులలో 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆంబులెన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే తాము నిబంధనలకు మేరకే చార్జీలు వసూలు చేస్తున్నామని ఆంబులెన్స్ నిర్వాహకులు అంటున్నారు. ఏదేమైనా కరోనా లాంటి విపత్కర పరిస్థితిల్లో ఆంబులెన్స్ సామాన్యులకు తలకు మించిన భారంగా మారిందని  అంటున్నారు. 108 వాహనాల సంఖ్యను ప్రభుత్వం పెంచితే ప్రజలకు ఇబ్బందులుండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments