Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఛాన్సెస్ తక్కువే : రణదీప్ గులేరియా

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:12 IST)
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాబోయే నెలల్లో కొవిడ్‌ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, కానీ, థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయన్నారు. 
 
‘థర్డ్‌ వేవ్‌లో చిన్నారులపై ప్రభావం’పై ఆయనను ప్రశ్నించగా.. టీకాలు వేయకపోవడంతో చాలా మందికి ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. అయినా పిల్లలు కరోనా బారినపడినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉండదని ప్రపంచ డేటా చూపిస్తోందన్నారు. 
 
అలాగే, పాఠశాలల పునఃప్రారంభమై ఆయన స్పందిస్తూ, వైరస్‌ సానుకూలత రేటు తక్కువ ఉన్న ప్రాంతాలు, కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తున్న ప్రాంతాల్లో తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చన్నారు. అయితే, కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. 
 
కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైతే వెంటనే వాటిని మూసివేయాలన్నారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరవడంతో ‘రిస్క్‌-బెనిఫిట్‌అనాలిసిస్‌’పై అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులకు భౌతిక తరగతులు చాలా ముఖ్యమైనవన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments