Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో సగం మంది ప్రజలు మాస్క్ ధరించడం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:25 IST)
కరోనా విజృంభిస్తోంది. ఇందుకు కారణం మాస్క్ ధరించకపోవడమే. దేశంలో ఇప్పటికీ సగం మంది ప్రజలు మాస్క్‌ ధరించడం లేదని.. మిగతా సగంమందిలో 64 శాతం మంది నోరు మాత్రమే కప్పి ఉంచేలా మాస్క్‌ ధరిస్తున్నారని ఓ అధ్యయనాన్ని ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 20 శాతం మంది గడ్డం వరకు, 2 శాతం మెడ దగ్గరకు పెట్టుకుంటున్నారని వివరించింది. కేవలం 14 శాతం మంది మాత్రమే కచ్చితంగా ధరిస్తున్నారని తెలిపింది. 
 
కాగా, పదివారాల పాటు పెరుగుతూ పోయిన పాజిటివ్‌ రేటు గత రెండు వారాలుగా తగ్గుతోందని వివరించింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్‌ 29-మే 5 మధ్య పాజిటివ్‌ రేటు తగ్గుదల ఉన్న జిల్లాల సంఖ్య 210 కాగా.. ప్రస్తుతం 303కు చేరిందని తెలిపారు. 
 
ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ రేటు అత్యల్పంగా 13.31 ఉందని చెప్పారు. 194 జిల్లాల్లో కేసులు, 121 జిల్లాల్లో పాజిటివ్‌ రేటు పెరుగుతోందని వివరించారు. ఏడు రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు 25పైన, 22 రాష్ట్రాల్లో 15 పైగా ఉందన్నారు.
 
కర్ణాటక, బెంగాల్‌లో పాజిటివ్‌ రేటు 25పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఫిబ్రవరి మధ్య నుంచి చూస్తే ప్రస్తుతం రోజువారీ పరీక్షలు 2.3 రెట్లు పెరిగాయని.. జూన్‌ నెలాఖరుకు రోజుకు 45 లక్షల పరీక్షలు చేసే స్థితికి చేరుకోగలమని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments