Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మహానగరంలో 800 పోలీసులకు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (11:16 IST)
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలోవుంది. ముఖ్యంగా, ఆ రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో పాజిటివ్ కేసులు పుట్టగొడుగుల్లా వెలుగు చూస్తున్నాయి. అయితే, కరోనా లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో 800 మందికి ఈ వైరస్ సోకింది. ఇటీవల టి నగర్ మాంబాళం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలమురళి కరోనా వైరస్ బారినపడి చనిపోయిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో చెన్నై నగరంలో విధులు నిర్వహించే పోలీసుల్లో 800 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. ఒక్క చెన్నైలో మాత్రం 10 రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటిక్‌ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదివరకు ప్రజల్లో వ్యాపిస్తున్న కరోనా ప్రస్తుతం కరోనా నిరోధక చర్యల్లో పాల్గొంటున్న పోలీసులు, వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. 
 
కరోనా లక్షణాలతో ఓ ఇన్‌స్పెక్టర్ మృతిచెందగా, ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న ఐపీఎస్‌ అధికారికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నగరంలో 800 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకగా వారిలో 321 మంది చికిత్సల అనంతరం డిశ్చార్జి అయినట్టు పోలీసు శాఖ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments