Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో ఆరు లక్షల పాజిటివ్ కేసులు - మరో కేంద్ర మంత్రికి కరోనా

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (20:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తూనేవుంది. దీంతో ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కూడా కొత్తగా మరో 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటిపోయింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో 1,383, పశ్చిమగోదావరి జిల్లాలో 1,064 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,177కి చేరుకున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరుకున్నాయి. 5,08,088 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 88,197 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
 
ఇదిలావుండగా, మరో కేంద్ర మంత్రి కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి కరోనా సోకినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు.
 
తాజాగా మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, రెండు రోజులుగా తనతో మెలిగిన వారు జాగ్రత్తగా ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments