పాఠశాలల్లో పాగా వేసిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో కరోనా వైరస్ పాగా వేసింది. రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. స్కూళ్లు తెరిచి పది రోజులు కూడా గడవక ముందే.. పదుల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారినపడ్డారు. 
 
పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 మంది విద్యార్థులు, 31 మంది ఉపాధ్యాయులు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది. 
 
తాజాగా ప్రకాశం జిల్లాలో 14 మంది విద్యార్థులు, 5 ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒంగోలు పట్టణంలో డీఆర్​ఆర్​ఎం ఉన్నత పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు వైరస్ నిర్ధరణ అయింది. పీవీఆర్ బాలికల పాఠశాలలో నలుగురు విద్యార్థులు, రాంనగర్ ప్రాథమిక పాఠశాలలో మరో విద్యార్థికి కరోనా సోకింది. ఉలవపాడు మండలం వీరేపల్లి పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, దర్శి మండలం నిమ్మరెడ్డిపాలెంలో ఓ ఉపాధ్యాయరాలికి కరోనా పాజిటివ్​గా తేలింది.
 
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడంతో ఈనెల 16 నుంచి పాఠశాలలను పునః ప్రారంభమైన విషయం తెల్సిందే. అయితే, పాఠశాలల్లో కరోనా కేసులు క్రమంగా పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల క్రితం కృష్ణా జిల్లా పెద్దపాలపర్రు పాఠశాలలో 13 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. బుధవారం విజయనగరం జిల్లాలో మరో 17 మంది విద్యార్థులకు కరోనా సోకింది. 
 
నెల్లూరు జిల్లాలో 17 మంది ఉపాధ్యాయులు, 10 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా..విద్యార్థులు వైరస్ బారిన పడటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments