Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో సత్యం టీవీలో 27 మందికి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (15:28 IST)
చెన్నై కేంద్రంగా ప్రసారాలు చేస్తున్న సత్యం టీవీలో పని చేసే సిబ్బందిలో 27 మందికి కరోనా సోకింది. వీరికి జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
స్థానిక రాయపురం, కల్‌మండపం, కామరాజ్ పార్క్ వీధి, ఒకటో నంబరులో ఉన్న భవనం నుంచి ఈ సత్యం టీవీ కొనసాగుతోంది. ఈ టీవీలో పని చేసే 24 యేళ్ల సబ్ ఎడిటర్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, అతని ద్వారా సబ్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న తండ్రికి సోకిందా? లేదా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
 
అలాగే, ఈ సంస్థలో పని చేసే 94 మంది సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 27 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇంకా మరికొందరి ఫలితాలు రావాల్సివుంది. దీంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెన్నై నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. 
 
అదేసమయంలో ఈ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు, వీరు కలిసిన స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేయడం జరిగింది. అలాగే, రాయపురంలోని ఈ సత్యం టీవీ కార్యాలయాన్ని కూడా మూసివేశారు. 
 
ఈ సబ్ ఎడిటర్ మాత్రమే కాకుండా ఓ తమిళ దినపత్రికలో పనిచేసే విలేకరికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ విషయం ఆదివారం తేలింది. ఈ విలేకరి ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ నిర్వహించిన మీడియా మీట్‌కు వెళ్లడంతో ముందస్తు జాగ్రత్తగా ఆమెకు కూడా కరోనా పరీక్షలు చేశారు. కాగా, సోమవారం ముంబైలో 53 మంది విలేకరులకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments