Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో ఒకే ఫ్యామిలీలో 22 మందికి కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. 
 
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతి చెందగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే మృతుడి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం యాదాద్రి టౌన్‌ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ 22 మందితో కాంటాక్టుయిన మరో ఆరుగురికి సైతం పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments