బెంగళూరు: 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (07:45 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదు. కర్ణాటకలోని సోమ్‌వర్‌పేట తాలూక పరిధిలోని ఓ కళాశాలలో 25 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. గారాగండురులోని మొరార్జీ దేశాయ్‌ పీయూ కళాశాలలో ఈ నెల 11 నుంచి ఆఫ్‌లైన్‌లో తరగరతులు నిర్వహిస్తున్నారు. సుమారు 76 మంది విద్యార్థులకు తరగతులకు హాజరవుతున్నారు. వీరందరికీ ఇంతకు ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ వచ్చింది. 
 
అయితే ఈ నెల 21న తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఒకరికి జ్వరం వచ్చింది. దీంతో ఆ విద్యార్థి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కాలేజీ యాజమాన్యం సూచించింది. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 
 
ముందస్తుగా మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయించగా.. 25 మంది మహమ్మారి బారినపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. దీంతో అధికారులు కళాశాలను 14 రోజుల పాటు మూసివేశారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు ధ్రువీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments