Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో మరో 13 వేల కరోనా పాజిటివ్ కేసులు

Advertiesment
Coronavirus
, సోమవారం, 25 జనవరి 2021 (10:10 IST)
దేశంలో 13 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 13,203 మందికి కరోనా వైరస్ సోకింది. వీటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది. అదేస‌మ‌యంలో ఈ వైరస్ బారి నుంచి 13,298 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,470కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు. 1,84,182 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 16,15,504మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో ఆదివారం వరకు మొత్తం 19,23,37,117 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,70,246 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది..