Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర పోలీస్ శాఖను వణికిస్తున్న కరోనా వైరస్

Webdunia
సోమవారం, 11 మే 2020 (17:27 IST)
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ దూకుడు అంతా ఇంతా కాదు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే 30 శాతం కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే, ఆ రాష్ట్ర పోలీసు శాఖను కరోనా వైరస్ వణికిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 221 మంది పోలీసులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో కరోనా వైరస్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 1007కు చేరింది. ఇందులో 106 మంది పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా, ఈ వైరస్ బారినపడి ఏడుగురు పోలీసులు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. 
 
కాగా, మహారాష్ట్రలో ఏకంగా 22 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇదే అత్యధికం. ఒక్క ముంబై మహానగరంలో ఏకంగా 12 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ముంబై తర్వాత పూణె, థానేలలో అత్యధిక కేసులు నమోదైవున్నాయి. అలాగే, మహారాష్ట్రలో ఇప్పటివరకు 832 మంది ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments