Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19 పరిస్థితి ఇలాగే వుంటే 20 లక్షల మంది మరణం: ఆందోళనలో WHO

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:07 IST)
కరోనావైరస్ మొదట చైనాలో వెలుగు చూపింది. ఆ తర్వాత యూరప్ దేశాలకు పాకిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది. ముఖ్యంగా యూరప్ లోని ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ప్రాణాంతక వైరస్ ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. అయితే యూరప్ దేశాలలో కొన్నాళ్లుగా సద్దుమణిగినట్టే కనిపించిన కరోనా భూతం మళ్లీ జడలు విప్పడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 
స్పెయిన్, ఫ్రాన్స్, పోలెండ్ వంటి దేశాలలో కొత్త కేసులు వచ్చిన దరిమిలా అక్కడ లాక్‌డౌన్ ప్రకటించారు. బ్రిటన్, రష్యా దేశాలలోను ఆక్షలు అమలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని రష్యన్లకు అక్కడి ప్రభుత్వం స్పపష్టం చేసింది.
 
ఈ పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ పరి స్థితి ఇలాగే కొనసాగితే 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఊందని తెలిపింది. కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోపోతే మరింత వినాశనం తప్పదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైఖేల్ రాన్ వివరించారు. గత ఆర్నెళ్లుగా ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టి పీడిస్తుండగా ఇప్పటివరకు 9.85 లక్షలు మంది మృత్యువాత పడ్డారు. 32.3 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments