Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19 పరిస్థితి ఇలాగే వుంటే 20 లక్షల మంది మరణం: ఆందోళనలో WHO

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:07 IST)
కరోనావైరస్ మొదట చైనాలో వెలుగు చూపింది. ఆ తర్వాత యూరప్ దేశాలకు పాకిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది. ముఖ్యంగా యూరప్ లోని ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ప్రాణాంతక వైరస్ ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. అయితే యూరప్ దేశాలలో కొన్నాళ్లుగా సద్దుమణిగినట్టే కనిపించిన కరోనా భూతం మళ్లీ జడలు విప్పడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 
స్పెయిన్, ఫ్రాన్స్, పోలెండ్ వంటి దేశాలలో కొత్త కేసులు వచ్చిన దరిమిలా అక్కడ లాక్‌డౌన్ ప్రకటించారు. బ్రిటన్, రష్యా దేశాలలోను ఆక్షలు అమలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని రష్యన్లకు అక్కడి ప్రభుత్వం స్పపష్టం చేసింది.
 
ఈ పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ పరి స్థితి ఇలాగే కొనసాగితే 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఊందని తెలిపింది. కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోపోతే మరింత వినాశనం తప్పదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైఖేల్ రాన్ వివరించారు. గత ఆర్నెళ్లుగా ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టి పీడిస్తుండగా ఇప్పటివరకు 9.85 లక్షలు మంది మృత్యువాత పడ్డారు. 32.3 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments