Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ 19 పరిస్థితి ఇలాగే వుంటే 20 లక్షల మంది మరణం: ఆందోళనలో WHO

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:07 IST)
కరోనావైరస్ మొదట చైనాలో వెలుగు చూపింది. ఆ తర్వాత యూరప్ దేశాలకు పాకిన ఈ మహమ్మారి క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది. ముఖ్యంగా యూరప్ లోని ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు ప్రాణాంతక వైరస్ ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. అయితే యూరప్ దేశాలలో కొన్నాళ్లుగా సద్దుమణిగినట్టే కనిపించిన కరోనా భూతం మళ్లీ జడలు విప్పడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 
స్పెయిన్, ఫ్రాన్స్, పోలెండ్ వంటి దేశాలలో కొత్త కేసులు వచ్చిన దరిమిలా అక్కడ లాక్‌డౌన్ ప్రకటించారు. బ్రిటన్, రష్యా దేశాలలోను ఆక్షలు అమలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని రష్యన్లకు అక్కడి ప్రభుత్వం స్పపష్టం చేసింది.
 
ఈ పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ పరి స్థితి ఇలాగే కొనసాగితే 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఊందని తెలిపింది. కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోపోతే మరింత వినాశనం తప్పదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైఖేల్ రాన్ వివరించారు. గత ఆర్నెళ్లుగా ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టి పీడిస్తుండగా ఇప్పటివరకు 9.85 లక్షలు మంది మృత్యువాత పడ్డారు. 32.3 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments