Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ జైలు ఖైదీలపై కరోనా పంజా, 120 మందికి కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (14:13 IST)
కరోనాకు చిన్నాపెద్ద తేడా తెలియదు. జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భరతం పడుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జైలులో ఉంటున్న ఖైదీలకు కరోనా అధిక సంఖ్యలో సోకింది. దీంతో ఉలిక్కి పడ్డ జైలు అధికారులు వారందర్ని ప్రత్యేక క్వారంటైన్‌కు పంపి ఊపిరి పీల్చుకున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది భారత్. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య మాత్రము పెరుగుతున్నాయి.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 12 లక్షలను దాటింది. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పోలీసులు, వైద్యులు వంటి పలురకాల ప్రముఖులను చవిచూసింది. కాగా ప్రస్తుతం జైలులో ఉంటున్న ఖైదీలు 120 మంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జైలులో ఈ ఘటన చోటుచేసుకున్నది.
 
అలాగే వీరితో ఎవరెవరు కాంటాక్ట్‌లో ఉన్నారో వారికి కూడా టెస్టులు నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం.దేశవ్యాప్తంగా ఉన్న కరోనా లిస్టులో యూపీ ఆరో స్థానంలో ఉంది.ప్రస్తుతం ఇక్కడ 55,588మందికి కోవిడ్ పాజిటివ్ కేసులుండగా అందులో 1263 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments