Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో కరోనా వైరస్ విజృంభణ: ఆక్సిజన్ అందక 76 మంది మృతి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:39 IST)
గోవాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ సగటున రెండు పరీక్షల్లో ఒకటి పాజిటివ్‌గా వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. 
 
శుక్రవారం కూడా గోవా వైద్య కళాశాల ఆస్పత్రి(జీఎంసీహెచ్‌)లో మరో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బాంబే హెకోర్టులోని గోవా బెంచ్‌కు వెల్లడించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలో 76 మందికి పైగా మృతిచెందారు.
 
ఆక్సిజన్ సరఫరా అందుబాటులో లేకపోవడంతోనే ఈ మరణాలు సంభవించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మంగళవారం ఇదే ఆస్పత్రిలో 26 మంది, బుధవారం 20 మంది, గురువారం తెల్లవారుజామున 15 మంది, ఈ రోజు ఉదయం 13 మందితో కలిపి.. మొత్తం నాలుగు రోజుల్లో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆక్సిజన్ సిలిండర్ల రవాణాలో ఎదురైన కొన్ని సమస్యల కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆక్సిజన్ కొరతతో చోటు చేసుకుంటున్న మరణాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి. 
 
వీటిపై హైకోర్టు విచారణ జరుపుతోంది. కోర్టులో విచారణ జరుగుతుండగానే.. జీఎంసీహెచ్‌లో ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments