Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలినడక ఛత్తీస్‌గఢ్ వెళ్లిన వలస కూలీలకు కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 7 మే 2020 (11:36 IST)
లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణా లేకపోవడంతో కాలినడకన సొంత రాష్ట్రానికి వెళ్లిన పలువురు వలస కూలీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వలస కూలీలు హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వలస కూలీలు తమతమ సొంతూర్ళకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, కొందరు కూలీలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కాలినడక బయలుదేరారు. వారంతా పది రోజుల పాటు నడక సాగించి చివరకు తమ సొంతరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు.
 
అయితే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధికారులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో 14 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో ఐదుగురు హైదరాబాద్​ నుంచి గత పది రోజులుగా నడుచుకుంటూ.. దారిలో కనిపించిన వారిని లిఫ్ట్ అడుగుతూ ఛత్తీస్​గఢ్ చేరుకున్నారు. 
 
హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌ జిల్లాకు వెళ్లిన ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ బాధితులతో సన్నిహితంగా ఉన్న 200 మందిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు. 14 మంది బాధితుల్లో ఆరుగురు కబీర్‌ధామ్‌ జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఐదుగురిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments