పదో తరగతి విద్యార్థులు 13మందికి కరోనా.. ఏపీలో కోవిడ్ అప్డేట్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (18:55 IST)
రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థులకు 13 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారంపాటు స్కూలుకు సెలవులు ప్రకటించారు. మరోవైపు రుద్రవరం కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్‌కు తరలించారు. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది స్కూలు పరిసరాలతో పాటు గ్రామం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లి కాలనీలను శానిటైజ్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,215 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 479 కొత్త కేసులు నమోదు కాగా.. ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,285కి చేరింది. 
 
తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,074 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 497 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,66,856కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,355 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,11,96,574 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments