Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తోన్న కరోనా.. రికార్డు స్థాయిలో 24 గంటల్లో 1133 మంది మృతి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:57 IST)
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1133మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 72,775కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఇక దేశంలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 90వేలకు చేరిన సంగతి తెలిసిందే. గడిచిన 24గంటల్లో 75,809 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42లక్షల 80వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 33లక్షల మంది కోలుకోగా మరో 8లక్షల 83వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా, మరణాల రేటు 1.7శాతం ఉంది.
 
ఇకపోతే, సోమవారం రోజు దేశ్యాప్తంగా 10,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది... దీంతో... ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 5,06,50,128కు పెరిగినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments