Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి ముద్ద, బత్తాయి రసం, చికెన్.. ఇవి తిని.. కరోనాను తరిమికొట్టాను: 102 ఏళ్ల బామ్మ!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:33 IST)
ragi-chicken
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో 102 ఏళ్ల వృద్ధురాలు కరోనా వైరస్‌ను జయించింది. అది కూడా డాక్టర్‌ల సమక్షంలో క్వారంటైన్ కేంద్రంలో చికిత్స తీసుకొని కాదండోయ్.. ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యుల సూచనలు సలహాలను అమలు పరుస్తూ కోవిడ్ వైరస్ బారి నుంచి బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంకు చెందిన 102 ఏళ్ల సుబ్బమ్మ అనే వృద్ధురాలు... కరోనా పరీక్షలు చేసుకోగా వృద్దురాలితో పాటు నలుగురు కుటుంబ సభ్యులకు పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబీకులు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడారు. 
 
ఈ క్రమంలోనే మిగతా కుటుంబ సభ్యులతో పాటు 102 ఏళ్ల బామ్మ కూడా కరోనా వైరస్ నుంచి కోలుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో ఆ బామ్మ ఎలాంటి ఆహారం తీసుకుని ఎలాంటి నిబంధనలు పాటించింది అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు. 
 
అయితే కరోనా బారిన పడిన తర్వాత... రాగి ముద్ద, బత్తాయి రసం, చికెన్, నాన్ వెజ్ వంటకాలు ఎక్కువగా తినే దానినని ... వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేసుకునేదాన్ని అంటూ ఆ బామ్మ అందరికీ హెల్త్ సీక్రెట్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments