Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులను కూడా వదలని కరోనా రక్కసి.. వెయ్యిమందికి..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (10:29 IST)
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చిన్న పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే దిశగా రూపం మార్చుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు వెయ్యి మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా అందింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరారు.
 
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 15 తేదీల మధ్య 2 వందల 64 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు వెయ్యి 53 మందికి, ఈ నెల ఒకటి నుంచి 14 వరకు వెయ్యి ఆరు వందల 18 మంది చిన్నారులకు వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చిన్నారులపై కొవిడ్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోందని స్పష్టమవుతోంది.
 
మొత్తంగా 21 వేల 8 వందల 57 మంది చిన్నారులకు వైరస్ సోకింది. కేవలం ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చిన్నారుల్లో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో చిన్నారులకు త్వరగా అందుబాటులోకి వస్తేగాని కట్టడి చేయలేమని…. టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments