Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:14 IST)
కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలా కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పు జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే.. మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిల్వవుంటాయి. అల్లం. పచ్చిమిర్చి కూడా అలానే మెత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి ఉప్పు వేసి నిల్వచేసుకోవచ్చు.
 
1. ఖాళీ అయిన నెయ్యి లేదా నూనె ప్యాకెట్లలో పప్పులు నిలువ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ధనియాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని బాణలిలో కాసేపు వేడిచేసి ఆపై డబ్బాలో నిల్వచేస్తే చాలాకాలం వరకు నిల్వ ఉంటాయి. 
 
2. పప్పులు, ఉప్పులు వేసుకునే సీసాలు మురికిగా ఉన్నట్లైతే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలిపి ఆ తర్వాత నీటితో కడిగితే జిడ్డంతా తొలగిపోతుంది. అలానే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన కొన్ని బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటాయి. 
 
3. సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా.. సగం తరిగిన బంగాళదుంప ముక్కను సూప్‌లో వేయండి. 15 నిమిషాల తరువాత తక్కువ మంటమీద సూప్‌ను వేడిచేస్తే ఉప్పును పీల్చేస్తుంది. ఆపై బంగాళదుంపను తీసేయొచ్చు.
 
4. పుదీనా, మిరియాలపొడి వంటి వాటిని సూప్‌‍లలో ఎక్కువగా చేర్చండి. అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది. మంచి రుచితోపాటు బలవర్థకం కూడా. సూప్‌లు చిక్కగా రావాలంటే.. మీకు నచ్చిన కూరగాయల్ని ఉడికించి తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో కలిపితే చాలా బాగుంటుంది.
 
5. ఎక్కువ రోజుల నుండి వాడుతున్న వంటసోడా సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఇలా చేయండి.. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా వంటసోడా వేయండి. నీటిలో వెంటనే బుడగలు వస్తే అది చక్కగా పనికొస్తుందని అర్థం.
 
6. ఆకుకూరలు, కూరగాయలను కడిగేటప్పుడు నీళ్ళల్లో చిటికెడు వంటసోడా చేరిస్తే.. వండిన తర్వాత ఆకుకూరలు రంగు మారకుండా ఉంటాయి. అంతేకాదు కుళాయి నుండి పట్టిన నీళ్లలో సూక్ష్మక్రిములు ఉంటే కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments