Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

సెల్వి
బుధవారం, 2 జులై 2025 (16:29 IST)
స్కూల్స్‌కు వెళ్లే పిల్లలకు పోషకాహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా అల్పాహారంలో పోషకాహారాలు పుష్కలంగా వుండేలా చూసుకోవాలి. ఉదయం పూట పిల్లలు పాఠశాలలకు వెళ్లే హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మానేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. 
 
ఎందుకంటే ఉదయం పూట తీసుకునే ఆహారం మెదడును ప్రభావితం చేస్తుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఉదయం పూట తీసుకునే ఆహారం పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుందని.. ఆ రోజంతా చురుకుగా వుండేలా చేస్తుందని వారు చెప్తున్నారు. ఉదయం పూట నిద్రలేచిన వెంటనే పిల్లలు బ్రష్ చేసుకున్నాక.. గ్లాసుడు నీరు తాగడం అలవాటు చేయాలి. కాలకృత్యాలు పూర్తి చేసుకుని.. స్నానం చేశాక తప్పకుండా అల్పాహారాన్ని తీసుకునేలా చేయాలి. 
 
ఒకవేళ అల్పాహారం తీసుకోకపోతే.. అది పిల్లల మెదడు ఆరోగ్యాన్ని మందగించేలా చేస్తుంది. అల్పాహారంగా కోడిగుడ్డు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు వుండేలా చూసుకోవాలి. తక్కువ చక్కెర కలిగిన తృణధాన్యాల అల్పాహారం, గోధుమ రొట్టె, వెన్న, పాలు, తక్కువ చక్కెర కలిగిన పాల ఉత్పత్తులు, గుడ్లు, బీన్స్ వంటివి ఆరోగ్యకరమైన అల్పాహార ఆహారాలు. ఇంకా అల్పాహారంలో ప్రోటీన్లు, పీచు వుంటే పిల్లల మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ఇంకా చదువుపై ఏకాగ్రత ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

తర్వాతి కథనం
Show comments