Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై రాజధాని కాలేజీ దశ తిరిగిందా?... 1,106 డిగ్రీ సీట్ల కోసం 95,136 దరఖాస్తులు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (13:32 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ప్రభుత్వ కాలేజీల్లో రాజధాని కాలేజీ ఒకటి. నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ వంటి మహానుభావులు చదివిన కాలేజీ. ఇపుడు ఈ కాలేజీ దశ తిరిగిపోయింది. జాతీయ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్) ర్యాంకుల జాబితాలో వరుసగా మూడో యేడాది చోటు దక్కించుకుంది. 
 
దీంతో ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. ఫలితంగా 1,106 డిగ్రీ కోర్సుల్లోని సీట్లకు ఏకంగా 95,136 దరఖాస్తులు వచ్చాయి. గత యేడాది ఈ సంఖ్య 53,668 ఉన్నాయి. సాధారణంగా ఈ కాలేజీకి ప్రతి యేటా 30 వేల నుంచి 35 వేల దరఖాస్తులు వస్తుంటాయి. కానీ, ఈ దఫా సంఖ్య లక్ష వరకు చేరుకున్నాయి. 
 
ఇదే అంశంపై కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.రామన్ మాట్లాడుతూ, గత జూలై 5వ తేదీన జరిగిన కాలేజీ స్నాతకోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి, పూర్వవిద్యార్థి అయిన ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలేజీ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. దీనికితోడు కలైంజ్ఞర్ పేరుతో ఆడిటోరియంను నిర్మించినట్టు ప్రకటించారు. పైగా, కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. 
 
దీనికితోడు ఎన్.ఐ.ఆర్.ఎఫ్‌లో వరుసగా మూడో ర్యాంకును కైవసం చేసుకుందన్నారు. ఇది కాలేజీపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న దురాభిప్రాయాన్ని పోగొట్టిందని తెలిపారు. ఈ కారణంగానే ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అమితాసక్తిని చూపుతున్నారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments