Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో ఉద్యోగ అవకాశాలు.. వేతనం రూ.1.50 లక్షలు

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (14:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 56 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో 27 పోస్టులు ఉన్నాయి. 
 
అలాగే, సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 10, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 19 చొప్పున ఉన్నాయి. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 23వ తేదీలోపు తమ దరఖాస్తులను చేరవేయాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఏపీ, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హ్లు. బీఈ, బీటెక్ సివిల్ లేదా మెకానికల్, ఎల్‌సీఈ, ఎల్ఎంఈ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి. అభ్యర్థుల వయస్సు 42 యేళ్లకు మించరాదు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు తితిదే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏఈఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే, ఏఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు జీతం అందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments