Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌- జెఈఈ 2021 కోసం ఫైనల్‌ను ప్రకటించిన ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:40 IST)
ఆగస్టు 18 మరియు ఆగస్టు 30,2021 తేదీలలో ఫైనల్‌ (ఫైనల్‌ ఇన్ఫినిటీ నేషనల్‌ లెర్నర్స్‌ ఎగ్జామ్‌)ను నిర్వహించబోతున్నట్లు ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య  ప్రకటించింది. దీనిలో భాగంగా విద్యార్థులు తమంతట తాముగా నమోదు చేసుకోవడంతో పాటుగా నమూనా పరీక్షలు రాయడం, గత సంవత్సరాల పరీక్షా పత్రాలకు సమాధానాలు రాయడం తదితర అంశాలను చేయవచ్చు. సెప్టెంబర్‌ 12 ,2021న జరిగే నీట్‌ పరీక్షలలో మంచి ర్యాంక్‌ సాధించేందుకు సన్నాహకంగా ఇది ఉంటుంది.
 
ఈ పరీక్షలు కేవలం విద్యార్థులు అత్యుత్తమంగా సిద్ధమయ్యేందుకు మాత్రమే సహాయపడటం మాత్రమే కాదు, టాప్‌ 1000 విద్యార్థులలో తాముండగలమో లేదో కూడా తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. విద్యార్థులు తమ హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌ (నీట్‌ పరీక్షకు సంబంధించినది) ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఒకే ఒక్క అర్హత అది. అదనంగా విద్యార్థులు నామమాత్రపు రుసుము 99 రూపాయలను పరీక్ష కోసం చెల్లించాల్సి ఉంటుంది.
 
మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌, టాప్‌ 10 విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకూ గెలుచుకునే అవకాశం, టాప్‌ 100 విద్యార్థులకు 1లక్ష రూపాయల వరకూ బహుమతులు అందుకునే అవకాశంతో పాటుగా 101-1000 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 25 వేల రూపాయల వరకూ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం infinitylearn.com చూడవచ్చు.
 
ఇన్ఫినిటీ లెర్న్‌ సీఈవో- ఉజ్వల్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రశ్నించే మనస్తత్వం ప్రోత్సహించే ఆన్‌లైన్‌ అభ్యాస వాతావరణాన్ని ప్రోత్సహించడంతో పాటుగా తాము హాజరయ్యే పరీక్షలలో సత్తా చాటగలమా లేదా అన్నది బేరీజు వేసుకునేందుకు సహాయపడుతూ పలు పరీక్షలను సైతం నిర్వహించే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. నిజానికి నీట్‌ పరీక్షల నూతన నమూనాలో ఎన్‌టీఏ చేత 48 గంటలలో ఫలితాలను ప్రకటించే రీతిలో పరీక్షను నిర్వహిస్తున్న మొట్టమొదటి వేదికగా మేము నిలిచాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments