రైల్వే శాఖలో ఉద్యోగాలు.. అర్హత టెన్త్ ఉత్తీర్ణత

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:19 IST)
భారతీయ రైల్వే శాఖలోని ఈస్ట్రన్ రైల్వే విభాగంలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా మొత్తం 2,972 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమై మే 10వ తేదీ వరకు కొనసాగుతోంది. దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సివుంటుంది. 
 
మొత్తం పోస్టుల్లో హౌరా డివిజన్‌లో 659, షిల్డా డివిజన్‌లో 297, కంచరపర డివిజన్‌లో 187, మాల్దా డివిజన్‌లో 138, అసన్సోల్ డివిజన్‌లో 412, జమాల్‌పూర్ డివిజన్‌లో 667, లిలుహ్ డివిజన్‌లో 612 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన విద్యార్హతను కలిగి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై వుండాలి. అలాగే దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments