Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి మార్కుల ఆధారంగా రైల్వే శాఖలో ఉద్యోగాలు...

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (12:58 IST)
వెస్ట్రన్ రైల్వేలో పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా ఏకంగా 3624 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మేన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మేన్ (సివిల్) తదితర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ముంబై కేంద్రంగా పని చేసే వెస్ట్రన్ రైల్వే పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 యేళ్లకు మించి ఉండరాదు. విద్యార్థులకు యేడాది కాల వ్యవధిలో అప్రెంటిస్‌ను అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇక దరఖాస్తుల స్వీకరణకు జూలై 26వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments