Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జేఈఈ మెయిన్స్ ర్యాంకుల రిజల్ట్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:31 IST)
బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ ర్యాంకులు సోమవారం వెలువడనున్నాయి. నాలుగో విడుత పర్సంటైల్‌తోపాటు తుది ర్యాంకులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించనుంది. దీంతోపాటు కటాఫ్‌ మార్కులను కూడా విడుదల చేయనుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో చూడవచ్చు.
 
ఇదిలావుంటే, సోమవారం మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 19 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చల్లించవచ్చు. 
 
అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. షెడ్యూల్‌ ప్రకార అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శనివారం ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. మెయిన్‌ క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి వీలుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments