Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తొలుత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీఆర్‌ను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. 
 
ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నంబరును నమోదు చేసి ఆపై వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన జిల్లాను నమోదు చేయడంతో ఓటీఆర్ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుపడుతుంది. 
 
ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో తగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజును చెల్లించి, మిగిలిన వివరాలను భర్తీ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, గురుకులాల్లో మొత్తం 9231 పోస్టులకు గురుకుల నియామక బోర్డు ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments