Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తొలుత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీఆర్‌ను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. 
 
ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నంబరును నమోదు చేసి ఆపై వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన జిల్లాను నమోదు చేయడంతో ఓటీఆర్ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుపడుతుంది. 
 
ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో తగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజును చెల్లించి, మిగిలిన వివరాలను భర్తీ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, గురుకులాల్లో మొత్తం 9231 పోస్టులకు గురుకుల నియామక బోర్డు ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments