Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తొలుత వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీఆర్‌ను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. 
 
ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నంబరును నమోదు చేసి ఆపై వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన జిల్లాను నమోదు చేయడంతో ఓటీఆర్ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుపడుతుంది. 
 
ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో తగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజును చెల్లించి, మిగిలిన వివరాలను భర్తీ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, గురుకులాల్లో మొత్తం 9231 పోస్టులకు గురుకుల నియామక బోర్డు ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments