Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలు వాయిదా.. సెప్టెంబర్‌లో మొదలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:06 IST)
జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలను వాయిదా పడ్డాయి. ఇంతా కొత్త తేదీలను కూడా కేంద్ర మానవ వనరుల మంత్రి ఫోక్రియాల్ ప్రకటించారు. సెప్టెంబర్ 1-6 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనుండగా, సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్, సెప్టెంబరు 13న నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోక్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ రావడంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించడం జరిగిందన్నారు. 
 
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీతో కూడిన నిపుణుల కమిటీ ఆధారంగా సెప్టెంబర్‌కు జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments