Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి జేఈఈ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడింగ్

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (14:48 IST)
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థ‌లైన ఐఐటీలు, ఎన్ఐటీల‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ మెయిన్ ప‌రీక్ష అడ్మిట్‌కార్డులు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. క‌రోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో వాయిదాప‌డిన‌ ఈ ప‌రీక్షను సెప్టెంబ‌రు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. 
 
అయితే, ఈ పరీక్షకు 15 రోజుల‌ముందు హాల్‌టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని వెల్ల‌డించింది. దీనిప్ర‌కారం ఈ నెల 15న అడ్మిట్ కార్డు‌లను విడుద‌ల‌చేసే అవ‌కాశం ఉన్న‌ది. 
 
జూలై జ‌ర‌గాల్సిన ఈ ప్ర‌వేశ‌ ప‌రీక్ష సెప్టెంబ‌రు నెల‌కు వాయిదాప‌డింది. విద్యార్థ‌లు క్షేమంగా ఉండాల‌ని, వారి ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండాల‌నే ఉద్దేశంతో ప‌రీక్ష‌ల‌ను వాయిదావేసిన‌ట్లు కేంద్ర విద్యాశాఖ‌, ఎన్‌టీఏ గ‌తంలో ప్ర‌క‌టించాయి. 
 
అయితే దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ప‌రీక్ష‌ను వాయిదావేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు. ఈనేప‌థ్యంలో ప‌రీక్ష వాయిదాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎన్‌టీఏగానీ, విద్యాశాఖ గానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో శ‌నివారం హాల్‌టికెట్లు వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments