Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 పోస్టుల భర్తీ.. ఐఈఎస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

Advertiesment
Union Public Service Commission
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ 2020 (ఐఈఎస్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి 12 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు 2020 సెప్టెంబర్ 1 చివరి తేదీ అని ప్రకటించింది. వాస్తవానికి గతంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది. 
 
కానీ ఖాళీలు లేకపోవడం వల్ల యూపీఎస్‌సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది యూపీఎస్‌సీ. కేవలం 15 పోస్టుల్ని మాత్రమే ప్రకటించింది. 
 
వీరిని కేంద్ర ప్రభుత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్స్‌లో నియమిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్పీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
 
మొత్తం ఖాళీలు- 15
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 11దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 1
ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పరీక్ష షెడ్యూల్- 2020 అక్టోబర్ 16 నుంచి 18
విద్యార్హత- ఎకనమిక్స్ లేదా అప్లైడ్ ఎకనమిక్స్ లేదా ఎకనమెట్రిక్స్ లేదా బిజినెస్ ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్ల లోపు 
దరఖాస్తుల విత్‌డ్రా- 2020 సెప్టెంబర్ 8 నుంచి 14
అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 15 రోజుల ముందు తీసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో అల్లర్లు.. ముగ్గురు మృతి.. యడ్యూరప్ప సీరియస్.. అసలేం జరిగింది?