Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం 'దోస్త్' గడువు పొడగింపు

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ఆన్‌లైన్ అడ్మిషన్లకు సంబంధించి రూపొందించిన ‘దోస్త్’ పోర్టల్ మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు శనివారంతో ముగిసింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోవడంతో గడువును మరోమారు పొడిగించారు. రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్. లింబాద్రి తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం వరకు 1.88 లక్షల మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వచ్చే నెల 4న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆ తర్వాతి రోజు నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18 వరకు జరుగుతుంది. అదే నెల 25న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments