Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కరోనా అప్డేట్.. నలుగురు మృతి.. 643 కేసులు

తెలంగాణలో కరోనా అప్డేట్.. నలుగురు మృతి.. 643 కేసులు
, శుక్రవారం, 23 జులై 2021 (21:26 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,20,535 శాంపిళ్లను పరీక్షించగా.. 643 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012కి చేరింది. నిన్న ఒక్క రోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,778కి పెరిగింది. నిన్న767 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,26,505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 77 నమోదు అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందస్తు చర్యల వల్ల ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి ఎర్రబెల్లి