కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (15:23 IST)
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆరు విడతలుగా నిర్వహించనుంది. యూజీ కోర్సుల కోసం ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగో విడత పరీక్ష జరుగుతుంది. ఇందులో దేశ వ్యాప్తంగా 3.72 లక్షల మంది విద్యార్థులు పాల్గొనున్నారు. అయితే వివిధ కారణాల రీత్యా అనేక పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ రద్దు చేసింది. దీంతో సుమారుగా 11 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దూరం కానున్నారు.
 
వీరిందరికీ ఈ నెల 30 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. వారంతా తమకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం సీయూఈటీ యూజీ పరీక్షలు ఈనెల 28న ముగియాల్సి ఉన్నది. అయితే తాజాగా చివరిదైన ఆరో విడత పరీక్షలను ఆగస్టు 24 నుంచి 30 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది.
 
ఇప్పటికే రెండో విడత సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎత్తివేసింది. ఈ కారణంతో పరీక్ష రాయలేకపోయిన వారికి ఈనెల 30 నిర్వహిస్తామని చెప్పింది. వారికి ఆగస్టు 20 తేదీ నుంచి అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments